హ్యాండ్ శానిటైజర్లు అతిగా వాడినా ప్రమాదమేనంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా అడ్వయిజరీలో హెచ్చరించింది. దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర దశకు చేరుకున్న తరుణంలో ఆరోగ్య శాఖ ఈ అడ్వయిజరీ జారీ చేయడం విశేషం.

'ఇదొక అసాధారణ స్థితి. ఎవరికీ వైరస్ స్వభావం ఏమిటో తెలియని పరిస్థితి ఉంది. మనలను మనం రక్షించుకోవడానికి మాస్క్‌లు వాడండి. తరచు వేడినీరు తాగండి. చేతులు బాగా కడుక్కుంటూ ఉండండి. శానిటైజర్లను మాత్రం అతిగా వాడొద్దు' అని ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్.కె.వర్మ తెలిపారు.

అతిగా హ్యాండ్ శానిటైజర్లు వాటడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే బాక్టీరియా సైతం చనిపోతుందని ఆరోగ్య నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు చేశారు. సబ్బు, నీళ్లు అందుబాటులో ఉన్నప్పుడు శానిటైజర్లకు బదులుగా వాటిని వాడటం మంచిదని కూడా వారు చెబుతున్నారు.