ఘనంగా కామ్రేడ్ సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలు.
ఘనంగా కామ్రేడ్ సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలు.
రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
పట్టణంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలను సూళ్లూరుపేట సిఐటియు నాయకులు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన వర్ధంతి సందర్భంగా సూళ్లూరుపేట ఆర్టీసీ స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సభ్యులు ఆర్టీసీ బస్టాండ్ లో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ద బత్తిన వెంకటరమణ ప్రారంభించారు. ఈ సర్వీసులో స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ మరియు సూళ్లూరుపేట సిఐటియు ప్రతినిధులు హాజరయ్యారు.అనంతరం రమణ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు నిరంతరం సర్వీసు చేసినటువంటి అంబేద్కర్ మరియు పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆశయాలను అమలుపరచాలని కోరారు.