మచిలీపట్నంలో పీజీఆర్ఎస్


పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ సందర్భంగా మచిలీపట్నంలోని కలెక్టరేట్ ప్రాంగణం అర్జీదారులతో కిటకిటలాడుతోంది. కలెక్టరేట్ మీటింగ్ హాలులో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ పీజీఆర్ఎస్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. పలు కౌంటర్లు ఏర్పాటు చేసి అంశాల వారీగా ప్రజల నుంచి అధికారులు రెవెన్యూ సమస్యలపై అర్జీలు స్వీకరించారు.