మెదడు వ్యాధితో బాధపడుతున్న బాలుడు

💢 బ్రైన్డ్ ఆపరేషన్ చేయాలంటున్న వైద్యులు

💢 శస్త్రచికిత్సకు రూ.10 లక్షల వరకు ఖర్చు

💢 ఆసుపత్రి ఖర్చులకు కూడా డబ్బు లేని పేదరికం

💢 బిడ్డను చూసి నరకయాతన పడుతున్న తల్లిదండ్రులు

 💢అపన్నహస్తం కోసం ఎదురుచూపు

💢 బాలుడు వైద్య ఖర్చులు కోసం నల్లప రెడ్డి వినోద్ రెడ్డి 10 వేలు సాయం

 కోట పట్టణంలో నివాసం ఉంటున్న వై నవీన్ కుమార్ జయశ్రీ కుటుంబాన్ని పేదరికం ఆపై* ఆరోగ్య సమస్యలు ఆ కుటుంబాన్ని కన్నీటి పాలుజేస్తున్నాయి. ఏ రోజుకారోజు కూలి పనులు చేసుకుని జీవించే వారికి అనుకోని కష్టం ఎదురైంది. చిన్న వయస్సు లో ఆనందంగా అందరితో సంతోషంగా జీవించాల్సిన  బాలుడు మంచానపడ్డాడు. మెదడు  సంబంధిత వ్యాధితో నిత్యం నరకయాతనఅనుభవిస్తున్నాడు.  బ్రైన్డ్ ఆపరేషన్‌ చేస్తే తప్పా ప్రాణాపాయం తప్పదని వైద్యులు చెప్పారు. ఆపరేషన్‌కు రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుండడంతో ఏమి చేయాలో దిక్కుతోచక ఆ కుటుంబం నిత్యం కన్నీటి పర్యవంతం అవుతోంది. ఆదుకునే అపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే....నెల్లూరు జిల్లాలో కోట పట్టణంలోని ముస్లిం వీధిలో  నివసిస్తున్న నవీన్ కుమార్,  జయశ్రీ  దంపతులకు ఇద్దరు  కుమారులు ఉన్నారు. జీవన్ బార్బర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.   నవీన్ జయశ్రీ  దంపతులకు ఇద్దరు కుమారులో మొదటి కుమారుడు అయిన  4 సంవత్సరాల వయస్సు కలిగిన షణ్ముగ షాశానక్  కొద్దీ నెలలు క్రితం అనారోగ్యానికి  గురయ్యారు. చికిత్స నిమిత్తం  చెన్నైలో ని సిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మెదడుకు సంబంధిత వ్యాధితో బాధపడుతోందని చెప్పారు. అప్పుడే ఒక సారి శస్త్రచికిత్స చేయించారు. కొంత కాలం ఆరోగ్యం గా ఉన్న బాలుడు  మరోసారి మెడకు సమస్యతో అనారోగ్యానికిగురయ్యారు,మరలా చెన్నై  సిమ్స్ ఆసుపత్రిలో మరోసారి శస్త్రచికిత్స  చేయించేందుకు  రూ.పది లక్షల వరకు అవుతుంది అని వైద్యులు తెలిపారు, బాలుడు అనారోగ్యం రోజు రోజుకు క్షిణిస్తుంది,  4 రోజులు క్రితం చెన్నై సిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు పరీక్షించి త్వరగా ఆపరేషన్ చేయాలని సూచించారు, ఆపరేషన్ చేస్తేనే ప్రాణాపాయంతప్పుతుందని వైద్యులు చెప్పారు. ఈ ఆపరేషన్‌ చేయడానికి రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే  లక్షల రూపాయలు వడ్డీకి తెచ్చి బాలుడి వైద్య ఖర్చు లు కోసం ఖర్చు చేశారు తల్లిదండ్రులు, ఇప్పటికి కూడా వడ్డీ చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న వారు రూ.10 లక్షలతో ఆపరేషన్‌ చేయించడం శక్తికి మంచిన పనిగా మారింది. రూ.10 లక్షలు లేక అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడు కి  చికిత్స చేయించలేక తల్లిదండ్రులు కన్నీటి పర్యవంతం అవుతున్నారు. ప్రతి నెలా రెండు సార్లు వైద్య పరీక్షలు చేసేందుకు రూ.10 వేల వరకు ఖర్చు అవుతుంది. రోజు వారి కూలి డబ్బులతో  బాలుడి కి వైద్యం  చేయిస్తున్నారు. తమ ఆర్థిక ఇబ్బందులను గుర్తించి దాతలెవరైనా ఆర్థిక సాయం చేసిఆదుకుంటారన్న ఆశతో కాలం వెల్లదీస్తున్నాడు. దాతలు ఎవరైనా ఆపన్నహస్తం అందజేసి ఆదుకోవాలని వారు కోరుకుంటున్నారు. సాయం చేయాలనుకున్న వారు 8985124358 కు ఫోన్‌ చేయాలని తండ్రి జీవన్ కుమార్ కోరుతున్నాడు. బాలుడు తండ్రి నవీన్ కుమార్ పేరుపై ఉన్న స్టేట్ బ్యాంక్  అకౌంటు నెంబరు వై.నవీన్  20218068306 SBIN0002811  విద్యానగర్ బ్రాంచ్ అకౌంటులో ఆర్థిక సాయం వేసి ఆదుకోగలరని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

 "బాలుడు వైద్య ఖర్చులకు నల్లప రెడ్డి వినోద్ రెడ్డి 10 వేలు సాయం"

 అనారోగ్యంతో బాధపడుతున్న కోట పట్టణానికి చెందిన వై.నవీన్ కుమార్,జయశ్రీ దంపతులు మొదటి కుమారుడు  షణ్ముగ షాశానక్ (4) మెడకు వ్యాధితో బాధపడుతున్నారు, రేక్కడితే డొక్కడాని కుటుంబం కావడంతో వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నారు, ఈ తరుణంలో కోట పట్టణానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి 10 వేల రూపాయలు సాయం చేసి తన  దాతృవాన్ని చాటారు, అంతే కాకుండా దాతలు ముందుకు వచ్చి బాలుడుకి ప్రాణం పోయాలి అనీ పిలుపునిచ్చారు, వినోద్ రెడ్డి దాతృవాన్నికి బాలుడు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు,