తిరుపతి పార్లమెంట్ బాట...వైసీపీదే బావుటా: ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


లక్ష ఓట్ల మెజారిటీ దాటితే ముఖ్యమంత్రి చొరవతో సూళ్లూరుపేట ఎమ్మెల్యేకి కేబినెట్ లో చోటుకు అవకాశం రావొచ్చు


సూళ్ళూరు పేట..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచే కంచుకోట


కంచుకోటను...మంచి కోటగా పెంచుకుంటూ పోతాం


తిరుపతి బై ఎలక్షన్ లో వైసీపీదే బావుటా


మంచి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే పాలన ఉన్న దొరవారిసత్రం మండలంలో టీడీపీకి డిపాజిట్లు 


సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రజల మనిషి, ప్రజల్లోనే ఉండే మనిషి


సూళ్లూరుపేటలో వైసీపీ జెండా ఎగరాలంటే మంత్రులు రానక్కరలేదు


ఇక్కడ ప్రజలు వైసీపీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారు


దొరవారిసత్రం మండలంలో ప్రతిపక్షాలు డిపాజిట్లు దక్కించుకోవడం కూడా కష్టమే


గత ఎన్నికలలో ఈ మండలంలో 23,893 ఓట్లు పోలయ్యాయి, అందులో వైసీపీవే 15, 891 ఓట్లు పడ్డాయి. 6,290 ప్రతిపక్షాలకు వచ్చాయి.


సంక్షేమ పాలనకు నిలువుటద్దంలా ఉన్న తరుణంలో 4వేల ఓట్లు అటు ఇటు అయితే చాలు


ఇక్కడి కార్యకర్తల కృతజ్ఞతభావం వలన నాకు కూడా ఎక్కువ కష్టపడకుండానే మంచి పేరు వస్తుందని చమత్కరించిన మంత్రి మేకపాటి


ముఖ్యమంత్రి సుపరిపాలనలో, ప్రజలకు ఎమ్మెల్యే అండదండలతో ఈ సారి పోటీలో నిలబడలేరు. తట్టుకోలేరు.


ప్రజల్లో ఉంటేనే ఓట్లు..ప్రజలకి మంచి చేస్తేనే మద్దతు

----------------------------


మనసు చలించి..మానవత్వం పంచి..


రోడ్డు ప్రమాదాన్ని గమనించి కాన్వాయ్ ఆపి తక్షణ రక్షణ చర్యలు చేపట్టిన మంత్రి మేకపాటి


సూళ్లూరుపేట నియోజకవర్గంలోని దొరవారిసత్రం మండలం ప్రచారానికి వెళుతూ..రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశంలో దగ్గరుండి మంత్రి మేకపాటి సహాయక చర్యలు


రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి  చెన్నైకి చెందిన ద్విచక్ర వాహనదారు


గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని మంత్రి ఆదేశం


గాయపడిన వ్యక్తిని ఆర్ఎస్ఐ చంద్రమౌళి ద్వారా ఆస్పత్రి తరలించేందుకు ఏర్పాట్లు చేసిన మంత్రి గౌతమ్ రెడ్డి