న్యూఢిల్లీ :-



శాస్త్ర సాంకేతిక విషయాలను పొరుగు దేశాలతో పంచుకోవడానికి భారత్​ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్ష వర్ధన్​ అన్నారు


తద్వారా ఉమ్మడి లక్ష్యాల సాధన సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని భారత్​ బలంగా విశ్వసిస్తోందన్నారు. 


రాష్ట్రాల్లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారానికి సైన్స్​ అనేది ఏకీకృత సాధనమని స్పష్టం చేశారు.


ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్​ ఫెస్టివల్​(ఐఐఎస్​ఎఫ్​)-2020లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆహ్వానం అందడం ఆనందంగా ఉంది. 


శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన వివిధ ప్రముఖులు, మంత్రులు, నిపుణులతో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా. 


ఇందులో పాల్గొన్న రాష్ట్రాల మంత్రులు.. కరోనా అనంతరం జీవనోపాధి అంశాలపై చర్చించారు. 


సైన్స్​ అండ్​ టెక్నాలజీ విషయాలను పొరుగు దేశాలతో పంచుకోవడాన్ని భారత్​ సదా విశ్వసిస్తుంది.


- డా.హర్ష వర్ధన్​, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి


ప్రజల ప్రతి సమస్యను సైన్స్ ద్వారా పరిష్కరించవచ్చని ఆరోగ్య మంత్రి అభిప్రాయపడ్డారు.