ప్రమాదానికి గురైన ఇండియన్ నేవీ హెలికాప్టర్.. ముంబై సముద్రతీరానికి సమీపంలో ఘటన..

భారత నావికాదళానికి చెందిన ఒక హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ముంబై సముద్రతీరానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని నేవీ అధికారులు ధ్రువీకరించారు.

అయితే తక్షణమై సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ముగ్గురు సిబ్బందిని రక్షించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టుగా నేవీ ఉన్నతాధికారులు తెలిపారు. హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది..