ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
అమరావతి :
ఏపీ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సచివాలయంలోని ఆర్టీజీ సెంటర్ నుంచి వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన, క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను నేరుగా కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని స్పష్టం చేశారు.