16 నుండి నివహిస్తున్న యువిక -2022 కార్యక్రమం ముగింపు వేడుకను షార్
 తిరుపతి జిల్లా. (సూళ్లూరుపేట) శ్రీహరికోట:-
ఇస్రో ఈ నెల 16 నుండి నివహిస్తున్న యువిక -2022 కార్యక్రమం ముగింపు 
వేడుకను షార్ లో శుక్రవారం ప్రారంభించారు,రెండు రోజులు పాటు జరిగే 
ముగింపు వేడుకలను షార్ లోని బీపీ హాలు లో షార్ డైరెక్టర్ A రాజరాజన్ 
జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు, దేశవ్యాప్తముగా వివిధ రాష్ట్రాలకు 
చెందిన 153 మంది విద్యార్థులు పాల్గొనడం జరుగుతుంది, ఈ విద్యార్థులు 
శుక్రవారం సౌండింగ్ రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యేక్షంగా వీక్షించారు, శనివారం తో 
యువిక - 2022 వేడుకలు ముగుస్తాయి, అంతరిక్ష శాస్త్ర సాంకేతిక రంగం వైపు 
యువతను ఆకర్షించడం కోసం ఇస్రో ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులను 
ప్రోత్సహిస్తుంది, ఈ కార్యక్రమం లో అసోసియేట్ డైరెక్టర్ M బద్రినారాయణ మూర్తి ,
MSA డైరెక్టర్ సెంథిల్ కుమార్ , గ్రూప్ డైరెక్టర్ గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


.jpeg)

.jpeg)
