భారతీయుల ఇళ్లల్లోకి చొరబడి చంపేస్తాం: పాక్


పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌పై మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో యుద్ధం వస్తే భారతీయుల ఇళ్లల్లోకి చొరబడి చంపేస్తామని ప్రగల్భాలు పలికారు. ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బను మర్చిపోయి ఆయన ఇలా మాట్లాడటం గమనార్హం. పశ్చిమాసియా ఉద్రిక్తతల సాకుతో పాక్ ఏ చిన్న తప్పు చేసినా గట్టిగా బుద్ధి చెబుతామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.