తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద సీనియర్ నాయకుల ఇళ్ల మీద ఏపీ సీఎం జగన్ గారి ఆదేశాలతో DGP కనుసన్నలలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు కు నిరసనగా ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నెల్లూరు జిల్లా పార్లమెంటు అధ్యక్షులు రూరల్ ఇన్చార్జి శ్రీ అబ్దుల్ అజీజ్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు 25 వ డివిజన్ ఇంచార్జి మాతంగి కృష్ణ గారి ఆధ్వర్యంలో బంద్ విజయవంతం చేయడానికి బుజ బుజ నెల్లూరు నుంచి బయలుదేరుతున్న సమయానికి వేదయపాలెం 5th టౌన్ పోలీస్ లు బంద్ చేయడానికి పర్మిషన్ లేదని మాతంగి కృష్ణ గారిని మరియు టిడిపి నాయకులను కార్యకర్తలను అరెస్టు చేసి5 th టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది
ఆంధ్ర బంద్ కు టీడీపీ పిలుపు
అప్రమత్తమైన పోలీసులు
మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ హౌస్ అరెస్టు
టీడీపీ నాయకులను కూడా హౌస్ అరెస్ట్
మాజీ ఎమ్మెల్యే పాశం ఇంటికి టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలిరావాలి అని టీడీపీ పిలుపు
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు పై దాడులు, టిడిపి నేత పట్టాభి ఇంటి పై వైసీపీ నేతలు దాడులు ఖండిస్తూ టీడీపీ అధిష్టానం, టీడీపీజాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు బుధవారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలను గృహనిర్బంధంలోఉంచుతున్నారు. అందులో భాగంగా గూడూరు టీడీపీ నేతలను పోలీసులు వాళ్ళ వాళ్ళ ఇళ్ల వద్ద పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు.
ముందుగా గూడూరు టీడీపీ మాజీ శాసన సభ్యులు పాశం సునీల్ కుమార్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బిల్లు చెంచు రామయ్య, నెలవల భాస్కర్ రెడ్డి, మట్టం శ్రావణి లతో పాటు పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధంలోఉంచారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాశం సునిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో గూండాగిరి పాలన చేస్తున్న ప్రభుత్వానికి చరమ గీతం పాడే రోజులుదగ్గరపడ్డాయని ఆయనధ్వజమెత్తారు .
మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై,టీడీపీ నాయకులు జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిమీద జరిగిన దాడిని నిరసిస్తూఅధినేత ,జాతీయఅధ్యక్షులునారా.చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర బంద్ కు పిలుపు ఇవ్వడంజరిగిందిఅన్నారు,అందులోభాగంగారాష్ట్రబంద్ లోపాల్గొనకుండా ముందస్తుగా పోలీస్ పహారా తో హౌస్ అరెస్ట్ చేయడం దారుణం అన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన చరిస్తున్నారని,ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగాఉందనివిమర్శించారు.ప్రభుత్వవ్యతిరేకవిధానాలను ప్రశ్నిస్తే గూండాగిరి చేస్తున్నఅధికారప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నేతలు,కార్యకర్తలు, అభిమానులు గూడూరు అశోక్ నగర్ లో ఉన్న తన ఇంటిదగ్గరకుతరలిరావాలి అని పిలుపునిచ్చారు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన బంద్ ను విజయ వంతంచేద్దాం అని ఆయన వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా వైసిపి అల్లరి మూకల దాడిలో టిడిపి కార్యాలయాల ధ్వంసం, భౌతిక దాడులు జరిగిన నేపథ్యంలో టిడిపి అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పిలుపిచ్చిన రాష్ట్ర బంద్ ను నిలువరించే ప్రయత్నం లో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారిని నెల్లూరు, మాగుంట లేఔట్ లోని ఆయన నివాసంలో దర్గామిట్ట పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ వైసిపి నాయకులు, కార్యకర్తలు బరితెగించి టిడిపి నాయకులపై, టిడిపి కార్యాలయాలపై దాడులు చేస్తుంటే స్పందించని పోలీసులు, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్న నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు. పోలీసులు అత్యుత్సాహం అక్రమ హౌస్ అరెస్ట్ లలో కాకుండా దోషుల్ని శిక్షించడం లో చూపితే బావుంటుంది. దాడులు జరిగే సమయంలో మౌనం పాటించడం, దాడి అనంతరం టిడిపి నేతలు కనీసం నిరసన తెలిపే స్వేచ్ఛ ఇవ్వకుండా అరెస్టులు చేయడం, అనంతరం బాధితులపై అక్రమ కేసులు బనాయించడం పోలీసులకు నిత్యకృత్యం గా మారింది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సజీవంగా ఉందని డీజీపీ భావిస్తే టిడిపి కార్యాలయాలపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి.