రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు
ప్రతి పల్లెలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు
కూటమి ప్రభుత్వంలో మళ్లీ గాడిన పడిన రాష్ట్ర అభివృద్ధి
వైసీపీ నాయకులకు తెలిసింది అవినీతి, అక్రమాలతో క్యాష్ అండ్ క్యారీ మాత్రమే
సర్వేపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం
మనుబోలు మండలం పిడూరు పంచాయతీలో రూ.1.75 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
పిడూరులో పర్యటించిన సోమిరెడ్డికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు
రూ.1.20 కోట్లతో జాతీయ రహదారి నుంచి పిడూరు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
పిడూరు – యాచవరం మధ్యలో సప్లయ్ ఛానల్ పై రూ.40 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవం
రూ. 15 లక్షలతో రెండు సిమెంట్ రోడ్ల నిర్మాణం
రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు ట్రాక్ లో పడ్డాయి
వైసీపీ ఐదేళ్ల పాలన కక్షసాధింపులకు పరిమితమైంది.రైతులకు వ్యవసాయ పరికరాలు అందించడం, విద్యార్థులకు మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించడం వంటి పనులు వారికి తెలియదు.ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ విధానంలోనే ఐదేళ్లూ కొనసాగారు.కూటమి ప్రభుత్వంలో కక్షసాధింపులకు అవకాశం లేకుండా, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్నాం .రాజకీయ ముద్ర వేసి పింఛన్లు తొలగించడం , యూరియా ఇవ్వకుండా ఆపడం, సంక్షేమ పథకాలు రద్దు చేయడం వంటి పనులు చేయవద్దని మా నాయకులకు స్పష్టంగా తెలియజేశాం. వైసీపీ పెద్ద మనుషులు చేసిన అక్రమాలను సరిదిద్దే ప్రయత్నంలో ఉన్నాం.ప్రస్తుతం పిడూరు వరకు నిర్మిస్తున్న రహదారిని త్వరలోనే లక్ష్మీనరసాపురం, కాగితాలపూరు మీదుగా జాతీయ రమదారికి కలుపుతాం .రెండో దశలో ఆ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేస్తాం .యాచవరం బ్రిడ్జి వందలాది ఎకరాల రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది త్వరలోనే మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం .రూ.3 కోట్లతో మనుబోలులో హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుంటాం సంక్షేమ పథకాలు, అభివృద్ధి విషయంలో నిరుపేదలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం గతంలో ఎప్పుడూ లేని విధంగా పరిశ్రమల సీఎస్ఆర్ నిధులను సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఖర్చు చేయిస్తున్నాం






Post a Comment