సూళ్లూరుపేటలో ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

సూళ్లూరుపేటలో ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సెప్టెంబర్ 17: - 

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  జన్మదిన సందర్భంగా బుధవారం స్థానిక సూళ్లూరుపేటలోని శివాలయము నందు వారికి ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కలగాలని మరియు భారతదేశాన్ని , భారతదేశ ప్రజల యొక్క యోగక్షేమాలు మరియు వారికి సూపరిపాలన అందించే శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని బిజెపి కార్యకర్తలు ప్రార్థిస్తూ పూజాదికాలు నిర్వహించడం జరిగింది. మరియు వారి 75వ జయంతి సందర్భంగా 75 కొబ్బరికాయలను కొట్టడం జరిగింది.

 పై కార్యక్రమానికి ఆలయ చైర్మన్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి  సూళ్లూరుపేట అర్బన్ మండల సేవా పక్షోత్సవ కమిటీ ఇన్చార్జ్ ఆరని విజయభాస్కర్ రెడ్డి , జిల్లా కార్యదర్శి బెజవాడ విజయమ్మ,  సీనియర్ నాయకులు తన్నీరు శేషగిరిరావు,  సేవా పక్షోత్సవ అర్బన్ కమిటీ మెంబర్లు  నూతలపాటి శ్రీనివాసులు,  ఇంగిలాల సాగర్,  పిచ్చుక సూరిబాబు, తుర్లపాటి శ్రీనివాసులు, కసంశెట్టి నిర్మలమ్మ, హైమావతి, మల్లికార్జునరెడ్డి , తడ మండలాధ్యక్షుడు తేజ రెడ్డి, రూరల్ సెక్రటరీ వాసు కుమార్ గౌడ్, అభిషేక్, దేవేందర్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి, మొదలగువారు పాల్గొన్నారు.

తదనంతరం చెంగాలమ్మ తల్లి దేవాలయానికి వెళ్లి మోడీ  పేరుతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చన చేయడం జరిగింది.





Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget