తల్లిని హతమార్చిన తనయుడు అరెస్ట్

 తల్లిని హతమార్చిన తనయుడు అరెస్ట్.

 వివరాలు వెల్లడించిన డిఎస్పి చెంచుబాబు.

రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట/ దొరవారిసత్రం :-


దొరవారిసత్రం మండలంలోని చందనమూడి గ్రామంలో ఏప్రిల్ 25వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో తల్లిని హతమార్చిన తనయుడని పోలీసుల అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడం జరుగుతుందని డీఎస్పీ చెంచు బాబు తెలియజేశారు.

కుటుంబ కలహాల నేపథ్యంలో ఆంబూరు సుజాత అను ఆమెపై తన పెద్ద కుమారుడు అయిన ఆంబూరు సుధీర్ తల్లి పై పెట్రోల్ పోసి నిప్పు అందించగా కాలిన గాయాలతో నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు తెల్లవారుజామున మరణించందని, మృతురాలి  కుమారుడు అంబూరు సుధీర్ సాక్షాలను దాచిపెట్టి ఎవరికీ అనుమానం రాకుండా తన తల్లి ప్రమాదవశాత్తు మరణించినట్లుగా అందరినీ నమ్మించాడని, నేర స్థలములు క్షుణ్ణంగా పరిశీలించి క్లూస్ టీం, నేర స్థలములో అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను భద్రపరిచి దర్యాప్తు కొనసాగించి కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ముద్దాయి అంబురు సుధీర్ ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడం జరుగుతుందని డిఎస్పి చెంచు బాబు మీడియా సమావేశంలో  తెలియజేశారు.



Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget