నెల్లూరు జిల్లాలో 30 ఏళ్లుగా ఎదురుచూపులు!
రాపూరు(M) కండలేరు జలాశయం నిర్మాణానికి భూములు ఇచ్చిన 19 గ్రామాల ప్రజలు 30 ఏళ్లుగా పునరావాసం కోసం ఎదురుచూస్తున్నారు. వేల ఎకరాల భూములతో పాటు విలువైన పండ్ల తోటలను కోల్పోయారు. ఇందులో కొంతమందికే ఇళ్లు కేటాయించారు. 117 కుటుంబాలకు ఇళ్లు ఇచ్చినప్పటికీ మరో 60 కుటుంబాలకు ఇప్పటికీ కాలనీ ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వాలు మారడంతో పనులు ఆలస్యమవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Post a Comment