నెల్లూరు: మంత్రి నాదెండ్ల రాకతో తీరు మారేనా..
జిల్లాలో ధాన్యం సేకరణలో మిల్లర్లదే ఇష్టారాజ్యంగా ఉంది. ధాన్యం సేకరణకు తేమ శాతం, తరకలు, రాళ్లు, లారీలు ఏర్పాటు చేయకపోవడం వంటి కొర్రీలు పెట్టి రైతులకు చుక్కలు చూపుతున్నారు. జిల్లాలో 3 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేయగా 11 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశారు. సాధారణ రకానికి రూ.20,300 మద్దతు ధర ఉంటే దళారులు రూ.17వేలుకు కొనుగోలు చేస్తున్నారు. గొనె సంచులు, కొరత కల్లాలు రైతులను వేధిస్తున్నాయి.
Post a Comment